Tuesday, March 19, 2024

ఆదర్శ పట్టణంగా పులివెందుల

ఆదర్శ పట్టణంగా పులివెందులను తీర్చిదిద్ధడమే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఆశయమని, ఆ మేరకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, పులివెందులలో వివిధ అభివృద్ధి పనులు, కార్యక్రమాల ప్రగతిపై అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ మొదట వేంపల్లి -ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ లో పర్యటించారు. ట్రిపుల్ ఐటీలో వివిధ ఇంజినీరింగ్ నూతన బ్లాక్స్, లైబ్రరీ, క్యాంటీన్, స్టూడెంట్స్ కొరకు ఇతర సౌకర్యాల బ్లాక్ పనులు, 1700 మంది కూర్చోగల ఆడిటోరియం పనులలు, ట్రిపుల్ ఐటీ సమీపంలో 3 మెగా వాట్ సోలార్ పార్క్ పనులను పరిశీలించారు. ఈ నెలాఖరులోపు పనులన్నీ నాణ్యతగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. నూతన భవనాలు, లైబ్రరీ, క్యాంటీన్ పరిసరాల్లో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని పాడా ఓ ఎస్ డి, ట్రిపుల్ ఐటీ వీని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular