Thursday, March 28, 2024

పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ ఏజెన్సీపై ముఖ్యమంత్రి సమీక్ష

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పాడా)పై శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

– పులివెందుల మోడల్ టౌన్ ను నాలుగు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్దం చేశామని సీఎంకు వివరించిన అధికారులు.
– 2053 వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికను రూపొందించామన్న అధికారులు.
– నాడు-నేడు కింద స్కూళ్ళు, ఆసుపత్రులను నిర్థిష్టమైన నమూనాలకు అనుగుణంగా నిర్మించాలన్న సీఎం.
– నగరంలో మంచినీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ది ప్లాంట్ తదితర సదుపాయాలను కల్పిస్తున్నామన్న అధికారులు.
– పాడా పరిధిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నమూనాలను సీఎంకు వివరించిన అధికారులు.
– నిర్మించే భవనాలు ఏళ్ళు గడుస్తున్నా కొద్దీ మరింత అందంగా కనిపించేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం.
– అభివృద్ధిలో పులివెందులను మోడల్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామన్న అధికారులు
– ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న వసతులను కూడా కల్పించి ఆధునీకరిస్తున్నామన్న అధికారులు.
– వీధి వ్యాపారులకు రెండు, మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్న అధికారులు.
– ఉలిమెల చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద అభివృద్ధి చేయాలన్న సీఎం.
– మంచినీటి శుద్ధి ప్లాంట్ ను కూడా అనుబంధంగా ఏర్పాటు చేయాలన్న సీఎం.
– ఈ చెరువు నుంచి పాడా పరిధిలో ప్రజలకు మంచినీటిని అందించవచ్చని సూచించిన సీఎం.
– పులివెందులలోని మెయిన్ రోడ్ ను మార్పు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం.
– మెయిన్ రోడ్ లో మనం చేసే మార్పుతోనే నగరంలోని అన్నింటిలోనూ మార్పు వస్తుందన్న సీఎం
సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular