సర్వమానవ సమానత్వం, కరుణ, దాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా మంత్రి సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ బాబుజీ అట్టాడాలు రంజాన్ శుభాకాంక్షలను తెలియజేశారు. శాంతి, సహనం, మతసామరస్యం, సౌబ్రాతృత్వం చాటిచెప్పే పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలందరు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు.