ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులో 18వ శతాబ్దానికి చెందిన శాసనం లభ్యమైంది. రామచంద్రదేవ వద్ద ఉన్న స్థపతి నరహరిదేవ అనే వ్యక్తి పెద్దనపాడులో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారని శాసనంలో ఉన్నట్లు మైసూరు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మణిరత్నంరెడ్డి తెలిపారు. కన్నడ లిపి, కన్నడబాషలో శాసనం ఉందన్నారు. 1938లో ఆర్కియాలజీ సర్వేఆప్ ఇండియా బృందం పెద్దనపాడు సందర్శించినప్పుడు ఈశాసనం అక్కడ లేదని పేర్కొన్నారు.