2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ గెలుపొందిన డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో 2021లో ఉప ఎన్నిక నిర్వహించారు. వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధను వైఎస్సార్సీపీ బరిలోకి దింపారు. సుధకు పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 112211ఓట్లు లభించగా సమీప భాజపా అభ్యర్థి పొనతల సురేష్కు కేవలం 21678ఓట్లు లభించాయి. 90553 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
జన్మించిన తేది | 09-07-1972 |
తల్లిదండ్రులు | డి.ఓబులయ్య, డి.విక్టోరియా |
విద్యార్హత | ఎంబీబీఎస్ డీజీవో |
జన్మించిన గ్రామం | పెదుళ్లపల్లె, బి.కోడూరు మండలం |
మెట్టినిల్లు | వల్లెరవారిపల్లె, గోపవరం మండలం |
సంతానం | కుమార్తె హేమంత, కుమారుడు తనయ్ |