నల్లమల అటవీ ప్రాంతం. మైదుకూరు మండలం గంజికుంట సెక్షన్ తిప్పిరెడ్డిపల్లె బీట్లో మూడేళ్ల కిందట వేసి బోరు నుంచి నీరు ఉబికి వస్తోంది. వేసవికాలం.. వానాకాలం అనే తేడా లేకుండా నిరంతరం వస్తున్న నీరు పక్కనే ఉన్న బాలబ్బావిలోకి చేరుతున్నాయి. వన్యప్రాణాల దాహార్తి తీరుస్తోంది. ప్రభుత్వ నిధులతో మూడేళ్ల కిందట దాదాపు 900అడుగుల లోతుతో బోరు వేయగా బోరు వేసిన నాటిని నుంచి మోటార్ల అమరిక లేకుండానే నీరు ఉబికి వస్తోంది. మూడేళ్లకాలంలో ఎప్పుడూ బోరు నుంచి నీరు రావడం ఆగిపోలేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.