ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్కు క్యాబినెట్ హోదా
ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డికి క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ఈ ఏడాది మే 17న జారీ చేసిన జీవోఎంఎస్ నెం.36 లో పేర్కొన్న విధంగా ”ఎస్” కేటగిరీ కింద క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ సీఎంవో కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈసందర్భంగా ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ క్యాబినేట్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.