1,815 Views
ఉపజలాశయం-1. తెలుగుగంగ పథకంలో అంతర్భాగం. 107.260కి.మీ వద్ద ప్రారంభం అవుతుంది. రూ.22.46కోట్లు చేశారు. అందులో ఎ బండ్ నిర్మాణం కోసం రూ.16.73కోట్లు, బి.బండ్ నిర్మాణానికి రూ.5.73కోట్లు ఖర్చు పెట్టారు. ఉపజలాశయం-1 నుంచి చెన్నైకి నీటిని సరఫరా చేసేందుకు వీలుగా దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట మండలాల మీదుగా 45.05కి.మీ నిర్మించిన చెన్నముక్కపల్లె కాల్వ ద్వారా 20316ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది.
కనిష్ఠ నీటి మట్టం (మీటర్లలో) | 208 మీటర్లు |
గరిష్ఠ నీటి మట్టం (మీటర్లలో) | 223 మీటర్లు |
పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం | 2.133 టీఎంసీలు |
డెడ్స్టోరేజ్ | 0.289 టీఎంసీలు |
ఉపజలాశయం-2. తెలుగుగంగ పథకంలో అంతర్భాగం. 113.344కి.మీ వద్ద ప్రారంభం అవుతుంది. దీనికోసం రూ. 34.38కోట్లు ఖర్చు చేశారు. ఉపజలాశయం-2 నుంచి వనిపెంట, జీవీసత్రం మీదుగా 32కి.మీ నిర్మించిన కాల్వ ద్వారా 10445ఎకరాల ఆయకట్టు సాగునీరు ఇవ్వాలి.
కనిష్ఠ నీటిమట్టం | 204.000 మీటర్లు |
గరిష్ఠ నీటిమట్టం | 222.780 మీటర్లు |
పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం | 2.444 టీఎంసీలు |
డెడ్స్టోరేజి | 0.18 టీఎంసీలు |